రంగారెడ్డి, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా.గడ్డం రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై తెలంగాణ అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడం గొప్ప నిర్ణయమని ఎంపీ కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.