సూర్యాపేట, జూన్ 14 (నమస్తే తెలంగాణ): బీ జేపీ ప్రేరేపిస్తేనే.. అటు దేశంలో, ఇటు తెలంగాణలో ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులపై ఐటీ, సీబీ ఐ, ఈడీ సంస్థలు దాడులు చేస్తున్నాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. ఎన్ని దాడు లు చేసినా.. కేసులు పెట్టినా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భయపడరని, బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడు తూ.. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బం ది పెట్టేందుకు మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు.
ఐటీ, సీబీఐ, ఈడీ ద్వారా రాజకీయ ప్ర త్యర్థులను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. తాజాగా తమ ఎమ్మె ల్యే పైళ్ల శేఖర్రెడ్డితోపాటు మరికొందరు ప్రజాప్రతినిధులపై ఐటీ దాడులు చేయిస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తెల్ల కాగితంలా ఉన్నారని, బీఆర్ఎస్లో చేరక ముందు నుం చే వాళ్లు వ్యాపారంలో ఉన్నారని, సకాలంలో ఐటీ చెల్లిస్తున్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రజల పక్షాన్నే పోరాడుతుందని, ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల అండతో ముందుకుపోతామని చెప్పారు.