హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని మంగళవారం పునఃప్రారంభించనున్నట్టు టీటీడీ తెలిపింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి తిరుపతిలోని కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు లభిస్తాయని వెల్లడించింది. అదేరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శన స్లాట్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నది. డిసెంబర్ 23న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం సోమవారం రాత్రి ఏకాంతసేవతో శాస్ర్తోక్తంగా ముగిసింది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు ఆదివారం సాయంత్రానికి క్యూకాంప్లెక్స్లోని 13 కంపార్ట్మెట్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు ఐదుగంటల్లో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది.