హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిలిచిపోయిన తిరుమల శ్రీవారి సర్వదర్శనాలను తిరిగి ప్రారంభిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. సర్వదర్శనం టోకెన్లను బుధవారం ఉదయం 6 గంటల నుంచి భూదేవి కాంప్లెక్స్ కౌంటర్లో జారీ చేస్తారు. రోజుకు 2 వేల మందిని మాత్రమే సర్వదర్శనానికి అనుమతిస్తారు. గతంలో రోజుకు 8 వేల మందికి సర్వదర్శనం టోకెన్లు జారీచేసేవారు. ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు అవకాశమిచ్చి, ఆ తర్వాత అన్ని ప్రాంతాలవారికి విస్తరించాలని టీటీడీ నిర్ణయించింది.