హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ హైదరాబాద్కు ఐఎస్వో గుర్తింపు లభించింది. సోమవారం వర్సిటీ వీసీ కట్టా నరసింహారెడ్డి, రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్కు ఐఎస్వో గుర్తింపు సర్టిఫికెట్ను ఆ సంస్థ నిర్వాహకులు అందజేశారు. యూనివర్సిటీలో పవర్ సేవింగ్, ఫుడ్ తయారు చేసి హాస్టళ్లకు పంపిణీ చేయడం, పచ్చదనం, విద్యాపరమైన సర్వీసులు అందించడం, గ్రీన్ జోన్, రెయిన్ హార్వెస్టింగ్, పొల్యూషన్ కంట్రోల్ ప్రక్రియ వంటి వాటిలో ఐఎస్వో గుర్తింపు పొందినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.