హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ వర్సిటీ నిర్వహించే కౌన్సెలింగ్కు ఆగస్టు 14 నుంచి 18 వరకు రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించారు. గురువారం హైదరాబాద్లోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ ఐసెట్ కౌన్సెలింగ్ను షెడ్యూల్ను విడుదల చేశారు.
ఆగస్టు 16 నుంచి 19 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఆగస్టు 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 25న ఎంబీఏ, ఎంసీఏ తొలి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబర్ 1 నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ఆప్షన్ల నమోదు, 7న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 8న స్పాట్ మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు లింబాద్రి తెలిపారు.