హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : ఇరిగేషన్శాఖలో ఎట్టకేలకు పలువురి ప్రమోషన్లకు సంబంధించిన ఫైలు ముందుకు కదిలింది. అడ్డంకులు దాటి జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)కి చేరుకున్నది. త్వరలో నిర్వహించబోయే డీపీసీలో క్లియర్ అయ్యే అవకాశమున్నది.
ఇరిగేషన్శాఖలో ఇప్పటికే పలువురు సీఈలను ఈఎన్సీలుగా, ఎస్ఈలకు సీఈలుగా, ఈఈలకు ఎస్ఈలు ప్రమోషన్లను కల్పించారు. ప్రస్తుతం కేవలం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) నుంచి డీఈఈ (డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్), డీఈఈ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా ప్రమోషన్లు కల్పించాల్సి ఉన్నది.