హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్శాఖ అధికారులతో జలసౌధలో ఆయన మంగళవారం పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాలో తలపెట్టిన సీతమ్మసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టును 15 నెలల్లోనే పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించగా, అందుకు అనుగుణంగా సత్వర చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొత్త రిజర్వాయర్ల వద్ద చేపపిల్లల పెంపకం కేంద్రాల ఏర్పాటుకు భూమిని కేటాయించే అంశంపై కూడా అధికారులతో చర్చించారు.