హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): కవిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా జూపల్లి ప్రేమ్చంద్ లేని లోటు పూడ్చలేనిదని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ‘నారాయణ బాబు’, ‘దిగంబర’ కవిత్వాలపై తన ఆప్తమిత్రుడు ప్రేమ్చంద్ పరిశోధనలు ప్రామాణికమని పేర్కొన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా అన్నింటినీ దాటుకొని ముందుకుసాగిన ధైర్యశీలి అని, అలాంటి వ్యక్తి మరణం తీరని లోటు అని పేర్కొన్నారు.