సీఎండీ ప్రదీప్కుమార్ దాస్ వెల్లడి
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో 76 పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) ప్రాజెక్టుల కోసం రూ.8,809 కోట్ల రుణం మంజూరు చేసినట్టు ఇరెడా సీఎండీ ప్రదీప్కుమార్ దాస్ చెప్పారు. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఈడీఏ, ఇరెడా), ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) సంయుక్తంగా గురువారం హైదరాబాద్లోని ఫెడరేషన్భవన్లో ‘గ్రీన్ ఇండియా త్రు రెన్యూవబుల్స్’ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించాయి.
ఈ సందర్భంగా ప్రదీప్కుమార్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా తమ సంస్థ ఆర్ఈ ప్రాజెక్టుల కోసం రూ.1,21,061 కోట్ల రుణం మంజూరు చేసినట్టు చెప్పారు. అందులో తెలంగాణకు రూ.8,809 కోట్లు ఉన్నట్టు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు రూ.6,549 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఇరెడా డైరెక్టర్ (టెక్నికల్) చింతన్ షా, టీఎస్ఆర్ఈడీసీవో చైర్మన్, ఎండీ జానయ్య తదితరులు పాల్గొన్నారు.