హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : గొలుసుకట్టు సంస్థలకు ప్రముఖులెవరూ ప్రచారం చేయొద్దని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి విజ్ఞప్తి చేశారు. తాజా గా ఓ సంస్థకు ప్రముఖ బాలీవుడ్ నటు డు అమితాబ్ బచ్చన్ ప్రచారం చేయడంపై ఆయ న్ను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ట్వీట్ చేశారు.
‘గొలుసుకట్టు సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశ నం చేస్తున్నాయి. అమాయక ప్రజలను మో సం చేసి డబ్బు సంపాదిస్తున్నాయి. ఇలాంటి సంస్థలను సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం కానీ, వాటికి మద్దతు ఇవ్వడం కానీ చేయొ ద్దు’ అని సజ్జనార్ సలహా ఇచ్చారు. సజ్జనార్ హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు పలు మల్టి లెవెల్ కంపెనీలపై చర్యలు తీసుకొన్నారు.