హైదరాబాద్ : తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్ నియామకం అయ్యారు. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇంచార్జీగా డీజీపీగా అంజనీ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అంజనీ కుమార్ ఏసీబీ డీజీగా కొనసాగుతున్నారు.
ఇక రాచకొండ పోలీసు కమిషనర్గా డీఎస్ చౌహాన్ను నియమించారు. రాచకొండ సీపీగా కొనసాగుతున్న మహేశ్ భగవత్ను సీఐడీ అడిషనల్ డీజీగా నియామకం అయ్యారు. ఏసీబీ డీజీగా రవి గుప్తా నియామకం కాగా, విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా డీజీగా జితేందర్, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్ నియామకం అయ్యారు.
ఏసీబీ డీజీగా 2021, డిసెంబర్ 25వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్గా 2018 నుంచి 2021, డిసెంబర్ 24వ తేదీ వరకు కొనసాగారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీగా 2016 నుంచి 2018 వరకు సేవలందించారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీసుగా 2013 నుంచి 2016 వరకు పని చేశారు.