హైదరాబాద్, మార్చి 6: విదేశీ సంస్థలను ఆకట్టుకోవడంలో తెలంగా ణ రాష్ట్రం దూసుకుపోతున్నది. ఇప్పటికే బ హుళ జాతీ సంస్థలు రా ష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టగా.. తాజాగా ఈ జాబితాలోకి ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ దిగ్గజం ఫాక్స్కాన్ చేరింది. రాష్ట్రం లో ఐఫోన్ల తయారీ యూనిట్ను నెలకొల్పబోతున్నట్లు తైవాన్కు చెందిన ఈ పారిశ్రామిక దిగ్గజం సోమవారం లాంచనంగా ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలోని కొంగర క లాన్ వద్ద ఐఫోన్ల కోసం ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేస్తున్నది. భారత్లో ఐఫోన్ల అమ్మకాలు భారీగా పుంజుకోవడం, అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా చైనాలో ఉన్న యాపిల్ ప్లాం ట్ను ఇతర దేశాలకు తరలించాలని గతంలోనే సంస్థ నిర్ణయించింది. భారత్లో ఎక్క డ ఏర్పాటు చేసేదానిపై ఆరు నెలలు నిశితంగా పరిశీలించిన సంస్థ, చివరకు తెలంగాణను ఎంచుకున్నది. గతంలో పలు రాష్ర్టాల పేర్లు బయటకు వచ్చినప్పటికీ.. పారిశ్రామిక ప్రగతిపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటు న్న చర్యలు సంస్థను ఇక్కడకు ఆకర్షించాయి.