దుండిగల్, మే 12: దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలకు ప్రతిష్ఠాత్మక ఇపామ్ అవార్డు దక్కింది. హైదరాబాద్లో కళాశాల ప్రిన్సిపల్ కే శ్రీనివాస్రావుకు ఇపామ్ అధిపతి శ్రీనివాస్రెడ్డి అవార్డును అందజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో అత్యుత్తమమైన 8 కా లేజీలకు మాత్రమే ఈ గుర్తింపు దక్కింది. అనంతరం ఎంఎల్ఆర్ఐటీలో సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఏర్పాటుకు ఇపామ్తో అవగాహన ఒప్పందం చేసుకొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్లేస్మెంట్స్ హెడ్ రవిచంద్ర, మెంటార్ సర్ఫరాజ్ అహ్మద్, ఇపామ్ రీసోర్స్ డెవలప్మెంట్ మేనేజర్ గోసుల ఇమాన్యూయెల్ పాల్గొన్నారు.
సంతోషంగా ఉన్నది
ఈ అవార్డు రావడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని ఎంఎల్ఆర్ఐటీ కళాశాల సెక్రెటరీ మర్రి రాజశేఖర్రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా కేవలం 50 కళాశాలల్లో ఇపామ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలను నెలకొల్పి సాంకేతికపరమైన శిక్షణ అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.