హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): జియో స్పేషియల్ పరిజ్ఞానంపై ప్రత్యేకంగా హ్యాకథాన్ను నిర్వహిస్తున్నామని గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ-సీఐఈ ఇంక్యుబేషన్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. ఐటీ రంగంలో వివిధ టెక్నాలజీలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న టెక్నాలజీలను గుర్తించి, వాటితో సరికొత్త అప్లికేషన్ రూపొందించేందుకు హ్యాకథాన్ నిర్వహిస్తున్నామని చెప్పా రు. ఈ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్తో పాటు కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సహకారాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. ‘బిల్డ్ ఫర్ ఇండియా’ పేరుతో నిర్వహిస్తున్న ఈ హ్యాకథాన్లో మంచి ప్రతిభ చూపిన వారికి రూ.28 లక్షల బహుమతి ఉంటుందని, మొత్తంలో నలుగురిలో ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున గ్రాంట్ను పొందే అవకాశం ఉందని చెప్పారు. మరిన్ని వివరాలకు ఈ కింది లింకులో https://cie.iiit.ac.in/ geospatial-hackathon/ సంప్రదించాలని తెలిపారు.