హైదరాబాద్, సెప్టెంబర్17 (నమస్తే తెలంగాణ): నాగర్ కర్నూల్ జిల్లాలోని నార్లాపూర్ వద్ద సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కృతమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరో ముందడుగు. మరో 15 రోజుల్లో మరో వెట్న్ నిర్వహించి, రెండో పంపును కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం చకచకా కదులుతున్నది. అన్ని పంపుహౌజ్లలో మొత్తంగా 34 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో అధికారులు మరో 15 రోజుల్లో రెండో పంపును కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మోటరు బిగింపు ప్రక్రియ కూడా పూర్తయింది. త్వరలోనే తొలుత డ్రైరన్, తదుపరి వెట్న్న్రు కూడా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పంప్హౌజ్లో మొత్తంగా 8+1 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 2 పంపుల బిగింపు ప్రక్రియ పూర్తయింది. మిగిలిన పంపుల బిగింపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
కాలువలపై ప్రత్యేక దృష్టి
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో సుజలదృశ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కృతంకాగా, ప్రస్తుతం తాగు, సాగునీటిని అందించేందుకు ప్రధాన కాలువల నిర్మాణంపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. మొత్తంగా 3 నెలల్లో పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. ఈ మేరకు అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. అత్యంత కరువు ప్రాంతాలైన మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి తదితర జిల్లాల దాహార్తిని తీర్చడానికి, అక్కడి రైతాంగానికి సాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. పథకాన్ని మొత్తంగా రెండు దశల్లో చేపట్టాల్సి ఉంది. మొదటి దశలో తాగునీటికి సంబంధించిన పనులు, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని సంకల్పించింది. ఇప్పటికే తొలిదశకు సంబంధించిన తాగునీటి పనులు పూర్తికావచ్చాయి. ఇటీవలే పర్యావరణ అనుమతులకు కూడా మార్గం సుగమం కావడంతో రెండో దశ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తంగా ప్రాజెక్టు పరిధిలో 1,226 గ్రామాలకు తాగునీటిని, 1,536 చెరువులను నింపడంతోపాటు 12.30లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. అందుకోసం మొత్తంగా 915 కిలోమీటర్ల పొడవుతో ప్రధాన కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ప్రాజెక్టులో ప్రధానంగా వెంకటాద్రి రిజర్వాయర్ నుంచే ఆయకట్టు ప్రారంభం కానుండగా, సింహభాగం దాదాపు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉద్దండాపూర్ రిజర్వాయర్ కిందనే ఉన్నది. కాలువల నిర్మాణానికి సంబంధించి మొత్తంగా 15,515 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉండగా, అందుకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. మొత్తంగా 3 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలనే లక్ష్యం పెట్టుకొన్నది. అందులో భాగంగా ఇప్పటికే పలు రిజర్వాయర్ల కింద కాలువ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. టెండర్లను కూడా ఆహ్వానించింది.
కీలకంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోనే ఉద్దండాపూర్ రిజర్వాయర్ కీలకంగా ఉన్నది. ప్రాజెక్టు మొత్తం ఆయకట్టు 12.30 లక్షలు కాగా.. అందులో 9 లక్షల ఆయకట్టు ఈ రిజర్వాయర్ కిందనే ఉండటం విశేషం. ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి 4.6 కిలోమీటర్ల పొడవుతో రైట్ కెనాల్ -1, దాదాపు 100 కిలోమీటర్ల పొడవుతో రైట్కెనాల్ 2ను, 122 కిలోమీటర్ల పొడవుతో ఎడమ ప్రధాన కాలువ, 90 కిలోమీటర్ల పొడవుతో మద్దూర్ కెనాల్, 24 కిలోమీటర్ల పొడవుతో హన్వాడ కెనాల్ను నిర్మించాల్సి ఉంది. అందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే సుమారు రూ.5, 600 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేయగా.. ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవలే అధికారులు ఆ ప్రక్రియను కూడా ప్రారంభించారు.
ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి 122 కిలోమీటర్ల పొడవుతో వికారాబాద్ వరకు ఎడమ కాలువను తవ్వాల్సి ఉంది. అందుకు సంబంధించిన పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి రూ.1,469 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించింది. మిగిలిన కాలువల తవ్వకానికి సం బంధించి పనులకు సైతం టెండర్లను ఆహ్వానించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రాజెక్టులో భాగంగా ని ర్మించిన కురుమూర్తిరాయ రిజర్వాయర్ నుం చి 103 కిలోమీటర్ల పొడవుతో హైలెవల్ ప్ర ధాన కాలువ నిర్మించాల్సి ఉండగా, దీని కింద మొత్తంగా 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ పనులను చేపట్టేందుకు సైతం అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూసేకరణ ని ర్వహించి, మొత్తంగా 3 నెలల్లో పనులను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వెంకటాద్రి నుంచి ప్రధాన కాలువ
ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన వెంకటాద్రి (వట్టెం) రిజర్వాయర్ నుంచి ప్రధాన కాలువల నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవలే టెండర్లు ఆహ్వానించింది. 16.74 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ నుంచి ప్రధాన కాలువల నిర్మాణం ప్రారంభం కానున్నది. ఈ రిజర్వాయర్ నుంచి మొత్తంగా 149 కిలోమీటర్ల పొడవుతో హై లెవల్ కెనాల్ను, 28.96 కిలోమీటర్ల పొడవుతో లోవెల్ కెనాల్ను నిర్మించాల్సి ఉంది. ఆ పనులను మొత్తంగా మూడు ప్యాకేజీలుగా విభజించి రూ.454.56 కోట్లతో చేపట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం టెండర్లను ఆహ్వానించింది. లో లెవల్ కెనాల్ ద్వారా 16 వేల ఎకరాలకు, హైలెవల్ కెనాల్ ద్వారా 1.17 వేల ఎకరాలకు మొత్తంగా రంగారెడ్డి, నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాలో 1.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతోపాటు ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీరు కూడా అందనున్నది.