హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఓయూ సెంటర్లో ఏప్రిల్ 3 నుంచి నిర్వహించే గ్రూప్-1 శిక్షణా తరగతులకు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ సూచించారు.
ఇంటర్మీడియట్, డిగ్రీలో ఫస్ట్క్లాస్లో ఉత్తీర్ణత సాధించిన 200 మంది విద్యార్థులకు ఈ కోచింగ్ ఇస్తామని తెలిపారు. తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 040- 24071178, 040-27077929 నంబర్లను సంప్రదించాలని సూచించారు.