హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): సివిల్స్ శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 9 నుంచి వచ్చే నెల 8 వరకు http://studycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్ పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఆబ్జెక్టివ్ టైపు, ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3లక్షలకు మించొద్దని తెలిపారు. వివరాలకు http://twd.telangana.gov.in సంప్రదించాలని సూచించారు.