హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఇటీవల నిర్వహించిన జీఆర్ఈ, టోఫె ల్, ఐఈఎల్టీఎస్ ఆన్లైన్ ఎంట్రెన్స్ పరీక్షల్లో మాల్ప్రాక్టీస్కు పాల్పడ్డ వారిపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ సైబర్క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. అంతర్జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు పొందేందుకు నిర్వహించే ఈ పరీక్షల్లో ప్రాక్టర్, కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల సాయంతో మాల్ ప్రాక్టీస్ జరిగిందని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలోఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) ఇం డియా సంస్థ విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో ఈ పరీక్షల కోచింగ్ సెంటర్లను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ను సాంకేతిక విద్యామండలి పరిధిలోకి తేవాలని, ఈ పరీక్షలన్నింటినీ ఆఫ్లైన్లో నిర్వహించాలని ధర్మేంద్ర కోరారు.