హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ప్రముఖ గాంధేయ రచయిత్రి సరళా బెన్ 50వ దశకంలో రాసి, బొమ్మలు వేసిన ‘మహాత్మాగాంధీ చిత్రకథ’ పుస్తకాన్ని 14 భారతీయ భాషల్లో వివిధ రచయితలు అనువదించారు. ఆ పుస్తకాన్ని మహాత్మాగాంధీ మనవరాలు తారా గాంధీ భట్టాచార్య న్యూఢిల్లీలోని గాంధీ స్మారక నిధిలో ఆదివారం ఆవిషరించారు. ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రముఖ బాలసాహితీవేత్తలు డాక్టర్ సిరి, డాక్టర్ పత్తిపాక మోహన్ బాలల కోసం అనువదించారు. డాక్టర్ కరణ్సింగ్ అధ్యక్షతన పుస్తకావిష్కరణ సభ జరిగింది.‘బాలల తాత బాపూజీ’ పుస్తకానికి సైతం పత్తిపాక మోహ న్ ఇటీవల సాహిత్య అకాడమీ అవార్డు అందుకోవడం విశేషం.