హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం గతంలో విడుదల చేసిన కనీస వేతనాల సవరణ జీవోలను వెంటనే గెజిట్లలో ప్రచురించాలని సీఎం రేవంత్రెడ్డిని ఐఎన్టీయూసీ కార్యదర్శి దేవసాని భిక్షపతి కోరారు. బుధవారం ఆయన మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, హైకోర్టు న్యాయవా ది చికుడు ప్రభాకర్తోపాటు కలిసి సచివాలయంలో సీఎంకు వినతిపత్రం అందజేశారు. 16 ఏండ్లుగా కనీస వేతనాల సవరణ జరగక 1.20 కోట్ల మం ది కార్మికులు నష్టపోతున్నారని చెప్పా రు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆదాయం లేక బ్బందులు పడు తున్నట్టు చెపారు.