హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద 241 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన రాహుల్ అనే యువకుడు సులభంగా డబ్బు సంపాదించడానికి డ్రగ్స్ దందాలోకి దిగాడు. నైజీరియాకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ మైఖేల్ జాన్సన్ అలియాస్ హానర్తోతో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు.
మైఖేల్ జాన్సన్ను మూడు నెలల క్రితమే బెంగళూరు పోలీసులు దేశం నుంచి డిపోర్ట్ చేసినప్పటికీ, అతడు నైజీరియా నుంచే ఫోన్కాల్స్, వాట్సాప్ ద్వారా భారతదేశంలో డ్రగ్స్ నెట్వర్ను నడుపుతున్నాడు. ఈ క్రమంలో రాహుల్ అతడి వద్ద డ్రగ్స్ను కొనుగోలు చేసి ఇతరులకు అమ్ముతున్నాడు. అయితే ఇటీవల ఈగల్ ఫోర్స్ సిబ్బంది మోహిత్కుమార్ అనే డ్రగ్ పెడ్లర్ను పట్టుకోవడంతో రాహుల్ పేరు బయటికి వచ్చింది. దీంతో ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ నేతృత్వంలోని బృందం బెంగళూరుకు వెళ్లి రాహుల్ను అరెస్ట్ చేసింది.