ఉస్మానియా యూనివర్సిటీ, మే 28: ఉస్మానియా యూనివర్సిటీ జన్యుశాస్త్ర విభాగానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ రోజారాణి చేసిన పరిశోధనలకు అంతర్జాతీయ పేటెంట్ హక్కు లభించింది. రక్తంలో వివిధ రకాల క్యాన్సర్ కణాలను గుర్తించడం, సాధారణ రక్త కణాల నుంచి క్యాన్సర్ రక్త కణాలను వేరుచేయడం, వాటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడంలో ఆమె చేసిన పరిశోధనకు ఈ పేటెంట్ లభించింది.
ఆమె రూపొందించిన 60 పరిశోధనా పత్రాలు వివిధ అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. గతంలో ఆమె ఆస్ట్రేలియా, జర్మనీ నుంచి కూడా పేటెంట్ హక్కులు పొందారు. ఈ సందర్భంగా ఆమెను పరిశోధక విద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో పరిశోధక విద్యార్థులు డాక్టర్ సుమన్కుమార్, రమేశ్కుమార్, పవిత్ర, స్వాతి తదితరులు పాల్గొన్నారు.