హైదరాబాద్, మార్చి 27(నమస్తే తెలంగాణ) : ప్రపంచ కార్మిక దినం మే డే సందర్భంగా శ్రమశక్తి, బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డుల కోసం ఏప్రిల్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలని కార్మిక నేతలకు, పరిశ్రమల నిర్వాహకులకు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ సూచించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్డులోని కార్మికశాఖ కార్యాలయంలో గడువులోపు దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. దరఖాస్తులకు www.labour. telangana. gov.in సైట్ను సంప్రదించాలని సూచించారు.