హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థకు మరో అరుదైన గౌరవం దక్కింది. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ)శాఖకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్వో) సర్టిఫికెట్ లభించింది. గురువారం సింగరేణి ఆర్అండ్డీ జీఎం సుభానీకి ఈ సర్టిఫికెట్ అందజేశారు.
ఈ సందర్భంగా సుభానీ మాట్లాడుతూ సింగరేణిలో ఉత్పత్తి పద్ధతులు, రక్షణ, నాణ్యతతోపాటు వినూత్న పరిశోధనలు చేస్తూ సంస్థ అభివృద్ధికి ఆర్ అండ్ డీ ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు. ఆర్ అండ్ డీ అంతర్జాతీయంగా ఉన్న బొగ్గు గనుల పరిశోధనల సంస్థలకు ఏమాత్రం తీసిపోదని పేర్కొన్నారు.