హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : శనగ కొత్త వంగడాలతో రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. గురువారం హైదరాబాద్ పటాన్చెరులోని ఇక్రిసాట్లో ‘మెట్ట భూముల్లో సాగు విధానాలు, ఆవిష్కరణల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పలువురు వ్యవసాయ రంగ నిపుణులు నూతన వంగడాలు – పంట దిగుబడిపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆధునిక శనగ వంగడాల సాగుతో కలిగిన ప్రయోజనాలను వివరించారు. సాధారణ శనగల కంటే కొత్త వంగడాల్లో ప్రొటీ న్ పరిమాణం దాదాపు 22.6 శాతం అదనంగా ఉంటున్నదని తెలిపారు. పూసా 372, ఐసీసీ 4958, బీజీఎం 10216 రకాలు అత్యంత మేలు వంగడాలుగా అధ్యయనంలో తేలినట్టు చెప్పారు. ప్రస్తుత వంగడాల కంటే వీటితో 16 శాతం అధిక దిగుబడి ఉన్నదని పేర్కొన్నారు.