పేదల ఆకలి తీర్చుతున్న అజహర్కు యూకే పురస్కారం
హైదరాబాద్, జూలై 7: ఆకలితో అలమటించే అభాగ్యుల కడుపు నింపుతున్న మన హైదరాబాద్ బిడ్డ అజహర్ మఖ్సూసికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. తమ సేవల ద్వారా సమాజంలో మార్పు తెచ్చేవారికి బ్రిటన్ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక యూకే కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు అజహర్ను వరించింది. ‘సాని వెల్ఫేర్ ఫౌండేషన్’ ద్వారా దేశంలోని ఐదు నగరాల్లో ప్రతిరోజూ దాదాపు 1500 మంది నిరుపేదల కడుపును అజహర్ నింపుతున్నారు. ‘ఆకలికి మతం లేదు’ అన్న నినాదంతో నిస్వార్థ సేవ చేస్తున్నారు.