Inter Results | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న మధ్యాహ్నం 12:30 గంటలకు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9.9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం విద్యార్థులు ‘నమస్తే తెలంగాణ’ వెబ్సైట్తోపాటు https://.www.ntnews.com, https://.www. telanganatoday.com వెబ్సైట్లను సంప్రదించవచ్చు.