హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. సీసీ కెమెరాల నిఘాల మధ్య, జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహించారు. తొలిరోజే ఏకంగా 6,325 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. మొత్తంగా 1,47,873 మందికి 1,41,548(95.72%) మంది ప్రాక్టికల్స్కు హాజరైనట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య తెలిపారు. ఈ నెల 21 వరకు పరీక్షలు జరుగుతాయి.
ఇంకా చదవల్సిన వార్తలు
8 7, 8 తేదీల్లో సీటెట్ పరీక్షలు
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) పరీక్షలు ఈనెల 7, 8 తేదీల్లో జరుగనున్నాయి. జాతీయంగా 140 నగరాల్లో ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు రెండో సెషనలో పరీక్షలు జరుగుతాయని సీబీఎస్ఈ వర్గాలు వెల్లడించాయి.