హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): విద్యారంగం లో ఒమిక్రాన్ వేరియంట్ భయాలు అప్పుడే మొదలయ్యాయి. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదన్న డబ్ల్యూహెచ్వో హెచ్చరికల నేపథ్యంలో 76 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలను బడులను పంపించమని చెప్పేస్తున్నారు. 24 శాతం మంది మాత్ర మే స్కూళ్లకు పంపుతామంటున్నారు. దేశవ్యాప్తంగా లోకల్ సర్కి ల్స్ సర్వే నిర్వహించింది. 308 జిల్లాల్లో 15,875 మంది విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించింది. బడికి పంపించబోమని చెప్తున్న 76 శాతం తల్లిదండ్రుల్లో 10 శాతం మంది తమ జిల్లా, నగరంలో ఒక కేసు నమోదయ్యే వరకు పంపిస్తామని తెలిపారు. బడులకు పంపిస్తున్నవారిలో 14 శాతం తల్లిదండ్రులు ఇప్పటికిప్పుడు పిల్లలను బడి మాన్పిచ్చేస్తామన్నారు. తమ పిల్లల స్కూళ్లు తెరుచుకోలేదని 10 శాతం మంది తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఆన్లైన్ క్లాసులను ప్రారంభించడం ఉత్తమమని పేర్కొన్నారు. కొవిడ్ రెండోదశ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభంకాగా, ఒమిక్రాన్ ముప్పుతో చదువులు గాడితప్పుతాయనే భయాందోళనలు నెలకొన్నాయి.