అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో పొట్టేళ్ల పొట్లాట పోరు (Sheep Fighting) పోటా.. పోటీగా సాగింది. పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పొట్లాట పోటీలు నిర్వహించారు. పొట్టేళ్లతో సాగిన పోరు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. పోట్టేళ్లు ఒకదానికొకటి తలపడుతుండగా చూసేందుకు ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తరలొచ్చారు. పోటీలను ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలలో భాగంగా పొట్టేళ్ల పొట్లాట పోటీలను నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. నడిగడ్డలోని అయిజ తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పొట్టేళ్ల పోరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పోటీలకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 20 పొట్టేళ్లు తరలొచ్చాయి.
విజేతలు వీరే..
పొట్టేళ్ల పొట్లాటలో మొదటి బహుమతి జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన డల్ల నర్సింహులు (సుల్తాన్) (రూ.50, 016), రెండో బహుమతి హైదరాబాద్కు చెందిన రాజవల్లి కిల్లర్ గ్రూప్ (రూ.35,016) మూడో బహుమతి హైదరాబాద్కు చెందిన ఎంజే గ్రూప్ (రూ.20,016) నాల్గో బహుమతి హైదరాబాద్కు చెందిన క్రైమ్మేకర్స్ ప్రూప్ (మచ్చ)- 375) (రూ. 10,016) పొట్టేళ్లు కైవసం చేసుకున్నాయి. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు, భక్తులు పాల్గొన్నారు.