హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): నెలరోజుల్లోనే ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను వెల్లడిస్తామని ఇంటర్బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. మొత్తం 15 కేంద్రాల్లో 15 వేల మంది అధ్యాపకులతో స్పాట్ వాల్యుయేషన్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నిర్మల్, సిద్దిపేట, మంచిర్యాలలో కొత్తగా వాల్యుయేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇంటర్ ప్రధాన పరీక్షలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. 9.7 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారని వెల్లడించారు. కొన్నిచోట్ల మాత్రమే చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని పేర్కొన్నారు. కొన్ని ప్రశ్నల్లో ప్రింటింగ్ తప్పిదాలు వచ్చాయని, వచ్చే ఏడాది అవి పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు అధైర్య పడొద్దని, అపోహలను నమ్మొద్దని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే టోల్ఫ్రీ నెంబర్ 1800 599 9333కి కాల్ చేయాలని సూచించారు.
12 మంది డిబార్
ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాల్ప్రాక్టీస్కు పాల్పడుతున్న 12 మందిని గురువారం డిబార్ చేసినట్టు ఇంటర్బోర్డు అధికారులు తెలిపారు. వీరిలో నిజామాబాద్లో ముగ్గురు, వికారాబాద్లో ఒకరు, సంగారెడ్డిలో ఐదుగరు, సిద్దిపేటలో ముగ్గురు ఉన్నారు. గురువారం నిర్వహించిన కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2 పరీక్షలకు 3,91,242 మంది హాజరయ్యారు. 20,541 మంది గైర్హాజరయ్యారు.