హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఇంటర్బోర్డు అనుబంధ గుర్తింపు పెండింగ్లో ఉన్న కారణంగా వార్షిక పరీక్ష ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు రుసుము చెల్లించేందుకు ఇంటర్బోర్డు అవకాశం ఇచ్చింది. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆదేశాల మేరకు పరీక్ష ఫీజు జరిమానాను రూ.వెయ్యి నుంచి రూ.100కు తగ్గించినట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ వెల్లడించారు. శని, ఆదివారాల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని, విద్యార్థుల నుంచి స్వీకరించిన ఫీజును ఈ నెల 8లోపు ఇంటర్బోర్డు ఖాతాలో జమ చేయాలని అన్నారు. ఇదే చివరి అవకాశమని, గడువు పెంచబోమని నవీన్మిట్టల్ స్పష్టం చేశారు.