గద్వాల, జూలై 29 : ఉమ్మడి పాలమూ రు జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు ఒత్తిడి తేవడంతో సర్కార్ జూరాల ప్రాజెక్టు నుంచి పీజేపీ కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసింది. ఎల్ నినో సాకుతో నీళ్లు ఇవ్వకుండా.. ఎగువ నుంచి వచ్చిన వరద నీటిని విద్యుదుత్పత్తి పేరుతో దిగువకు విడుదల చేస్తూ నడిగడ్డను ఎడారిగా మార్చే కుట్రకు తెరలేపారు. ఈ విషయమై ‘క్యాబినెట్లో తీ ర్మానిస్తేనే నీళ్లిస్తాం’.. ‘ఏపీకి నీళ్లు నడిగడ్డకు కన్నీళ్లు’.. ‘సాగునీటి విడుదలలో జాప్యం ఎందుకో’? అన్న కథనాలు “నమస్తే తెలంగాణ” దినపత్రికలో ప్రచురితమయ్యాయి. దీనికితోడు ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల బాటపట్టారు. దీం తో ప్రభుత్వం దిగొచ్చింది. జూరాలకు వరద వస్తున్నా నెట్టెంపాడ్, భీమా ఫేస్-1, ఫేస్-2, కోయిల్సాగర్, జూరాల కుడి, ఎడ మ, ప్యారలల్ కాల్వలకు నీటిని విడుదల చే యకుండా విద్యుదుత్పత్తి పేరుతో వరదను దిగువకు విడుదల చేశారు. జూరాలకు ఎగు వ నుంచి 21 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా విద్యుదుత్పత్తికి 27,199 క్యూసెక్కులు వదిలి ఇక్కడి పాలకులు ఏపీపై తమ ప్రేమను చాటుకుంటున్నారు.