హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల షెడ్యూల్ను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి ప్రవేశాలు చేపట్టాలని షెడ్యూల్లో పేర్కొన్నారు. జూన్ 1 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభించాలని, జూన్ 30లోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఇంటర్ బోర్డ్ గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే వి ద్యార్థులు చేరాలని, వాటి జాబితాను టీఎస్బీఐఈ అధికారిక వెబ్సైట్లో ఉంచుతామని పేర్కొన్నారు. సీట్లలో ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు 29, వికలాంగులకు 3, ఎన్సీ సీ, స్పోర్ట్స్, ఇతర అర్హతలున్న వారికి 5, మా జీ సైనికోద్యోగుల పిల్లలకు 3, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కళాశాలల యాజమాన్యాలను ఆదేశించారు. ప్రతీ కాలేజీలో బాలికలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తెలిపారు.