గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి
వరంగల్, జూన్ 9: పారిశుధ్య వ్యవస్థలో మహిళల సాధికారత అవసరమని గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆస్కీ ప్రొఫెసర్ మాలతీ వెబినార్ ద్వారా దేశంలోని 800 ప్రొఫెసర్లు, ఎన్జీవోలు, అధికారులతో పటిష్ట పారిశుధ్య నిర్వహణ, కార్యక్రమాల ప్రణాళిక రూపకల్పనపై అభిప్రా యాలు సేకరించారు. కమిషనర్ పమేలా సత్పతి క్యాంపు కార్యాలయం నుంచి వెబినార్లో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రణాళికల తయారీతో మహిళ లను భాగస్వామ్యం చేసినప్పుడే జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. పారిశుధ్య సెక్టార్లో ఎక్కువగా మహిళలు నాలుగో తరగతి ఉద్యోగులుగా ఉన్నారని తెలి పారు. నిర్ణయాధికారం లేదని అన్నారు. శానిటరీ ఇన్స్పె క్టర్లుగా మహిళలు లేనందున శానిటేషన్ ఆశించిన స్థాయి లో జరుగడం లేదని ఆమె అభిప్రాయ పడ్డారు. మహిళలకు ప్రాధాన్యత కల్పించినప్పుడే కార్యక్రమాలు విజ యవంతం అవు తాయని ఆమె తెలి పారు. ఈ వెబినా ర్లో ఆస్కీ ప్రతినిధి రాజ్మోహన్ పాల్గొన్నారు.