హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలతో నూతన ఆవిష్కరణలు చేపట్టేందుకు టీహబ్, ట్రిపుల్ ఐటీలో సీఐఈలు ‘ఇన్నోవేట్ ఫర్ టుమారో’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పరిశోధనల ద్వారా భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాలను రూపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదం చేయనున్నదని టీహబ్ ప్రతినిధి తెలిపారు.
దీనికి సంబంధించి ఔత్సాహికుల ఎంపిక కార్యక్రమం 7న, సాయంత్రం 4 గంటలకు టీ హబ్లో ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు https://bit.ly/47 Wdi6W లింకులో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.