ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలు ఢీ కొనడంతో 16 మంది నంది మేడారం భక్తులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గోవిందరావుపేట మండలం మచ్చా పూర్ గ్రామ శివారులో జరిగింది.
స్థానికుల కథనం మేరకు..ములుగు నుంచి ఏటూరునాగారం వెళ్లే జాతీయ రహదారిపై రెండు ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 16 మందికి గాయాలయ్యాయి. మొత్తం 16 మంది గాయపడగా అందులో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా… మిగిలిన తొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.