హైదరాబాద్ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించింది. బంగారు తెలంగాణ, పల్లె, పట్టణ ప్రగతి, ఉత్తమ వార్తా చిత్రం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్కైలైన్ ఆఫ్ హైదరాబాద్ విభాగాల్లో ఫొటో కాంపిటీషన్లకు ఎంట్రీలను జూలై 9న ఆహ్వానించింది. ఈ మేరకు 96 మంది మొత్తం 1,200 ఫొటోలను పంపారు.
జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాల రిటైర్డ్ అసోషియేట్ ప్రొఫెసర్ ఎం నాగరాజ, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ గోవిందా రాజు చక్రధర్, హిందూ దినపత్రిక మాజీ చీఫ్ ఫొటోగ్రాఫర్ హెచ్ సతీశ్ సభ్యులుగా ఉన్న కమిటీ.. విజేతలను ఎంపిక చేసింది. మొదటి బహుమతి రూ.20వేలు, ద్వితీయ బహుమతి రూ.15వేలు, తృతీయ బహుమతి రూ.10వేలు, కన్సోలేషన్ బహుమతికి రూ.5వేలతో పాటు మెమెంటో, సర్టిఫికెట్ను ప్రదానం చేయనున్నారు. ఈ నెల 25న బహుమతులను ప్రదానం చేయనున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ తెలిపింది.
01. రజినీకాంత్ ( ప్రథమ,కన్సోలేషన్ )
02. గొట్టే వెంకన్న (తృతీయ)
03. ఎం.గోపికృష్ణ (కన్సోలేషన్)
04. గడసంతాల శ్రీనివాస్ (కన్సోలేషన్)
05. పి సైది రెడ్డి (కన్సోలేషన్) బహుమతులు పొందారు.