హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టు లకు 1.50 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తుండగా, ఆ మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాలకు వరద ఉధృతి పెరుగుతున్నది. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 31 గేట్ల ద్వారా వరదను దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతున్నది. ఆదివారం సాయంత్రానికి 3.22 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. నాగార్జునసాగర్కు 31,784 క్యూ సెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది.
మరో రెండు రోజులపాటు అదే స్థాయిలో వరద కొనసాగే అవకాశమున్నదని అధికారులు వెల్లడిం చారు. వారం రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు శనివారం సాయం త్రం 26 వేల క్యూసెక్కుల వరద నమోదు కాగా, ఆదివారం సాయం త్రానికి 16 వేలకు తగ్గిపోయింది. అదేరీతిలో ఎల్లంపల్లి, పార్వతీ, సరస్వతీ బరాజ్లకు 1.20 లక్షల క్యూసెక్కుల వరద రాగా ఆదివారం సాయంత్రానికి వరద సగానికిపైగా తగ్గింది. లక్ష్మీ బరాజ్, సమ్మక్క బరాజ్ల వద్ద మాత్రం 10 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద ఆదివారం సాయంత్రానికి 16 లక్షల క్యూసెక్కులకు తగ్గిపోయింది.