నిజమాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 14,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో రెండు వరద గేట్లతో 6,240 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్లతో 2,500 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈఈ రవి తెలిపారు.
సరస్వతీ కాలువకు 800, లక్ష్మీ కాలువకు 80 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం కలిగి ఉందని ఏఈఈ తెలిపారు.