నల్లగొండ : బీజేపీ(BJP)లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎన్నో ఏండ్లుగా పార్టీని నమ్ముకున్న వారిని కాదని పారాచూట్ నేతలకు టికెట్స్ ఇస్తుండటంతో ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి (Indrasena Reddy) బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపారు.
ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఉప ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన ఇంద్రసేనారెడ్డి.. ఈ ఎన్నికల్లో ఆయన బీజేపీ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇంద్రసేనారెడ్డిని కాదని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి సతీమణి నివేదిత రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఇంద్రసేనారెడ్డి ఆ పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు.