హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : ఇండియా అండ్ ఇండోనేషియా వైస్ చాన్స్లర్ల ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సదస్సుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ సీతారామారావుకు ఆహ్వానం అందింది. ఇండోనేషియాలో ఈ నెల 10, 11న ఈ సదస్సు నిర్వహించనున్నారు. ది ఇండోనేషియాలోని చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ విభాగం నుంచి మన దేశానికి చెందిన 20 మందికి ఆహ్వానం అందినట్టు వీసీ తెలిపారు.