RGIA | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో శనివారం ఉదయం నుంచి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్లైన్స్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారుల తీరుపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రయాణికులు. విమానం గోరఖ్పూర్కు ఎప్పుడు బయల్దేరుతుందో అధికారులు స్పష్టత ఇవ్వలేదు.