హైదరాబాద్ : ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన విమానాన్ని శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేనల్ ఎయిర్పోర్ట్లో సోమవారం అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని కడపకు బయలుదేరింది. కడపలో వాతావరణ సరిగా లేకపోవడంతో విమానం ల్యాండింగ్కు ఏటీసీ అనుమతించలేదు. కొద్దిసేపు విమానాన్ని ఆకాశంలో చక్కర్లు కొట్టిన అనంతరం పైలట్ విమానాన్ని హైదరాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.