హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): బొగ్గు రవాణాలో భారతీయ రైల్వే గణనీయ వృద్ధి సాధించిందని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేశ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
2021-22 సంవత్సరంలో 111 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేసి రికార్డు సృష్టించిందని తెలిపారు. విద్యుత్తు రంగానికి సరిపడా బొగ్గును రవాణా చేయటంలో సఫలీకృతం అవుతున్నామని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఉత్పత్తి కేంద్రాలకు పది శాతానికిపైగా సరఫరా పెంచామని వెల్లడించారు.