హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): చెట్ల ప్రాముఖ్యత చాటేలా వేసే కార్టూ న్లు (ట్రీటూన్స్) సమాజానికి ఎంతో మేలు చేస్తాయని గ్రీన్ ఇండియా కో-ఫౌండర్ రాఘవేంద్ర యాదవ్ చెప్పారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక కార్టూనిస్టు చిలువేరు మృత్యుంజయ్ ప్రతిభకు ఇలాంటి ఓ అరుదైన గౌరవం లభించడం ఎంతో హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. బెంగళూరు ఎంజీ రోడ్డులోని కార్టూన్ గ్యాలరీలో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్’ ఆధ్వర్యంలో శనివారం ప్రా రంభించిన ఎగ్జిబిషన్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చెట్లు లేకపోతే జీవుల మనుగడ కష్టమని చెప్పారు. చెట్లతో మానవ జీవితం ఎంతో ముడిపడి ఉన్నదని తెలిపారు. జనాల్లో చైతన్యం నింపేలా మృత్యుంజయ్ వేసిన కార్టూన్లు నేటి సమాజాన్ని ఎంతో ఆలోచింపజేస్తున్నాయని చెప్పారు.
గ్రీన్ చాలెంజ్ ఫౌండర్, ఎంపీ సంతోష్కుమార్ స్ఫూర్తితో నేడు చెట్ల పెంపకమనే యజ్ఞం పెద్దఎత్తున సాగుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో సురేశ్ జైరాం, కుంభం రేణుక, కార్టూనిస్ట్ మృత్యుంజయ్ తదితరులు పాల్గొన్నారు. శనివారం ప్రారంభమైన మృత్యుంజయ్ కార్టూన్ల ప్రదర్శ న ‘ట్రీటూన్’ ఈనెల 21వరకు కొనసాగనున్న ది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన మృత్యుంజయ్ 20 వేలకుపైగా కార్టూన్లు గీశారు. ప్రత్యేకించి పర్యావరణ జాగృ తి కోసం 200కు పైగా కార్టూన్లు వేశారు.