శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 26: అక్రమంగా తరలిస్తున్న 399 గ్రాముల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలపై అనుమానం వచ్చిన అధికారులు అతడిని క్షుణ్ణంగా సోదా చేయగా, లోదుస్తుల్లో 399 గ్రాముల బంగారం లభించింది.
ఆ బంగారం విలువ రూ.24.34 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.