హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఏప్రిల్ 13న జరగబోతున్న సదస్సులో ‘భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు, సవాళ్లు’ అంశంపై ప్రసంగించాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ, పారిశ్రామికశాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంగా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి రూపకల్పన చేసిన విధానాలు, ఫలితంగా సాధించిన విజయాలను సదస్సులో వివరించి స్ఫూర్తి నింపాలని విన్నవించింది.
ఈ మేరకు యూనివర్సిటీలోని కెల్లాగ్ సూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ డైరెక్టర్ శ్వేత మేడపాటి లేఖ రాశారు. ప్రస్తుతం భారత పారిశ్రామిక రంగంలో కొత్త అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? క్షేత్రస్థాయిలో ఎలాంటి సవాళ్లను ఎదురోవాల్సి ఉంటుంది? అన్న అంశంపై చర్చించేందుకు ఇండస్ట్రీ లీడర్లు, వ్యాపారవేత్తలు, విధానాల రూపకల్పనలో అనుభవం కలిగిన నాయకులను ఒక తాటిపైకి తేవాలన్న ఆలోచనతోనే ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. కొత్త ఆలోచనలు, ఆవిషరణలను ప్రోత్సహించాలన్న ఆశయంతో యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు పేర్కొన్నారు.