ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (CM KCR) హాట్టాపిక్గా మారారు. రైతులకు ఎప్పుడూ అండగా ఉండే సీఎం కేసీఆర్.. వ్యవసాయ రైతులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు మూడు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు ఈ నిర్ణయంపై స్పందించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు. అంతే దీనిపై జాతీయస్థాయిలో అనేకమంది తమ స్పందనను తెలిపారు.
కేసీఆర్ నిర్ణయం చాలా పెద్ద నిర్ణయమని అందరూ కొనియాడారు. అదే సమయంలో మరికొందరు కేసీఆర్ నిర్ణయం విన్న తర్వాత మోదీ సిగ్గుపడాలని అన్నారు.